Telugu News » Akbaruddin Owaisi : తెలంగాణలో ఎవరైనా మా ముందు తలవంచాల్సిందే…. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు…!

Akbaruddin Owaisi : తెలంగాణలో ఎవరైనా మా ముందు తలవంచాల్సిందే…. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు…!

నెహ్రూ దేశ విభజన చేయడం వల్లే దేశం రెండుగా విడిపోయిందన్నారు. దేశంలో ప్రతిసారీ హిందూ ముస్లిం ఘర్షణలు తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపణలు గుప్పించారు.

by Ramu

ఎంఐఎం(AIMIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రెడ్డి, రావు ఎవరైనా సరే తమ ముందు తల వంచాల్సిందేనన్నారు. నెహ్రూ దేశ విభజన చేయడం వల్లే దేశం రెండుగా విడిపోయిందన్నారు. దేశంలో ప్రతిసారీ హిందూ ముస్లిం ఘర్షణలు తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపణలు గుప్పించారు.

గాజి ఏ మిల్లత కాలనీలో అక్బరుద్దీన్ ఓవైసీ పర్యటించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తమ జోలికి రావద్దంటూ రేవంత్ రెడ్డికి సూచించారు. తమ జోలికి వస్తే రేవంత్ రెడ్డి జీవిత చరిత్రను బట్టబయలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

కావాలంటే తనను, తన అన్న అసదుద్దీన్ ఓవైసీని తిట్టాలన్నారు. తన తమ్ముడికి రాజకీయాల గురించి తెలియదన్నారు. అందువల్ల తమ కుటుంబం జోలికి రావద్దన్నారు. రేవంత్ రెడ్డి ముందు ఆర్ఎస్ఎస్, టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారని తెలిపారు. అందుకే ఆయన్ని ఆర్ఎస్ఎస్ టిల్లు అని పిలవాలన్నారు.

వాహద్ ఓవైసీనీ కాంగ్రెస్ 11 నెలలు జైలులో ఉంచిందన్నారు. సలర్‌ను కూడా జైలుకు పంపించారని మండిపడ్డారు. అసదుద్దీన్ ఓవైసీపై కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. తనను నిజామాబాద్ జైలులో ఉంచారని అన్నారు. తనకు ట్రీట్ మెంట్ చేయలేదంటే దానికి కారణం కూడా కాంగ్రెస్ అన్నారు. కాబట్టి తమను రెచ్చగొట్టవద్దని రేవంత్ రెడ్డికి సూచించారు.

ఇప్పటి వరకు దేశంలో ప్రతి సారి హిందూ- ముస్లింల గొడవలు తెచ్చింది కాంగ్రెస్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు జరిగిన 55 మతపరమైన గొడవలకు కారణం కాంగ్రెస్సే అని నిప్పులు చెరిగారు. నెహ్రూ దేశ విభజన వల్లనే భారత్-పాకిస్థాన్ రెండు భాగాలు అయ్యిందన్నారు. లేదంటే ఒకే దేశం ఉండేదన్నారు.

You may also like

Leave a Comment