Telugu News » Jogi Ramesh : బాబు, పవన్ కలవడం పాయిజన్..!

Jogi Ramesh : బాబు, పవన్ కలవడం పాయిజన్..!

పెడన ప్రజలకు పవన్ క్షమాపణ చెప్తారని చూశా. మా దగ్గర గొడవలు ఉండవు అని ముందే చెప్పా. అత్తారింటికి దారేది.. సినిమా పైరసీ పెడనలో చేనేత కార్మికులు చేశారని జైలులో పెట్టి కొట్టించారు పవన్.

by admin
AP Minister Jogi Ramesh Press Meet

జోగి రమేష్, మంత్రి

జనసేన (Janasena), టీడీపీ (TDP) కలయికే ఒక వైరస్. బాబు, పవన్ (Pawan) కలయిక పాయిజన్. ఇద్దరి వేషాలు, వెకిలి చేష్టలు ప్రజలకి తెలుసు. వీళ్లు చేసిన మోసాలను గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు స్కాములు కూడా జనానికి తెలుస్తున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో బాబును కలిసి.. మా బంధం విడదీయరానిది అని బయటకు వచ్చి పవన్ చెప్పాక మొదటి సభ ఫ్లాప్ అయింది.

AP Minister Jogi Ramesh Press Meet

పెడన ప్రజలకు పవన్ క్షమాపణ చెప్తారని చూశా. మా దగ్గర గొడవలు ఉండవు అని ముందే చెప్పా. అత్తారింటికి దారేది.. సినిమా పైరసీ పెడనలో చేనేత కార్మికులు చేశారని జైలులో పెట్టి కొట్టించారు పవన్. ఇదేనా పెడనపై అవవహన. ఆయన చెప్పే నీతులు మాకు తెలియవా? వంగవీటి రంగాను చంపింది ఎవరు? టీడీపీ వాళ్ళు కాదా? ముద్రగడను హింసిస్తే నోరు మెదపలేదు.

అవనిగడ్డ సభ ఫ్లాప్ కావడంతో పెడన సభలో దాడి చేయాలని చూస్తున్నారని సినిమా స్టైల్ లో కథ అల్లారు. పవన్ పెడన సభ సూపర్ డూపర్ అట్టర్ ఫ్లాప్ షో. పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్ముడుపోయాడు. జనసేన శ్రేణులు దీన్ని గమనించాలి. కాపులు దమ్మున్నవాళ్లు. పవన్ ను నమ్మరు. జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తితో నీకు పోటీనా?

ఏపీకి రావడానికి పాస్ పోర్టు అవసరం లేదు. ఇంతకీ పవన్ భారతీయుడా? రష్యా వ్యక్తా? చంద్రబాబు, పవన్, లోకేష్ ఉండేది హైదరాబాద్ లో. జనసేన ఎవరితో ఎప్పుడు పొత్తులో ఉంటుందో తెలియదు.

You may also like

Leave a Comment