Telugu News » Asia Games : షూటింగ్ లో భారత్ కు గోల్డ్, మొదలైన పతకాల వేట  

Asia Games : షూటింగ్ లో భారత్ కు గోల్డ్, మొదలైన పతకాల వేట  

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంష్ సింగ్ పన్వార్ 1893.7 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచారు.

by Prasanna
gold

చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలలో (Asia Games) భారత్ మొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ పోటీల్లో భారత్ కు ఇదే తొలి గోల్డ్ మెడల్ (Gold Medal). 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది. రుద్రాక్ష్ పాటిల్ (Rudrakksh Patil), దివ్యాన్ష్ పన్వర్, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్  కి గోల్డ్ మెడల్ సాధించి, ఈ ముగ్గురూ ఫైనల్స్‌కి ఇండివిడ్యువల్‌గా క్వాలిఫై అయ్యారు. 19వ ఆసియా గేమ్స్‌లో రెండో రోజు భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.

gold

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంష్ సింగ్ పన్వార్ 1893.7 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచారు. దీంతో గోల్డ్ మెడల్ వారికి కైవసం అయింది. 1893.7 స్కోరుతో వారు మునుపటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. ఈ ఈవెంట్లో దక్షిణ కొరియా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. చైనా షూటర్లు 1888.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు.

ముగ్గురు భారత షూటర్లలో రుద్రాంక్ష్ పాటిల్ అత్యధికంగా 632.5 స్కోరు సాధించగా.. ఐశ్వరీ తోమర్ 631.6 పాయింట్లు, దివ్యాంష్ పన్వార్ 629.6 పాయింట్లు పొందారు. ఇక రోయింగ్ లో భారత్ కు మరో పతకం లభించింది. నలుగురు సభ్యుల రోయింగ్ టీమ్ ఈవెంట్ లో భారత్ కు చెందిన జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశిష్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అంతకుముందు ఒకే వ్యక్తి పడవ నడిపే రోయింగ్ ఈవెంట్ లో భారత్ కు చెందిన బల్రాజ్ పన్వార్ స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయాడు.

ఆసియా క్రీడలు 2023 సెప్టెంబరు 23న మొదలయ్యాయి. ఇవి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్నాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 655 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆసియా క్రీడల చరిత్రలో ఈసారి భారత్ నుంచి అత్యధికంగా క్రీడాకారులు పాల్గొంటున్నారు.

You may also like

Leave a Comment