బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) జోస్యం చెప్పారు. కాంగ్రెస్ (Congress) మోసాలు మొత్తం మరో 6 నెలల్లో బయటపడతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు వరంగల్ (Warangal)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు..

గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా పార్టీ మారాలని ఫోర్స్ చేసినట్లు తెలిపారు. కానీ ఆయనను ఎన్ని ఇబ్బందులు పెట్టిన పార్టీ మాత్రం మారలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం తనను కూడా ఎవరెన్ని రకాలుగా బెదిరించిన భయపడనని దయాకర్ రావు స్పష్టం చేశారు. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) తాను పార్టీ మారుతున్నానంటూ దుష్ప్రాచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
అలాంటి ఉద్దేశం తనకు లేదని తెలిపిన ఆయన.. కేసీఆర్ కోసం సైనికుడిలా పని చేస్తానని.. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఎర్రవబెల్లి, బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ఊపందుకొన్నాయి. అయితే నేడు ఆయన ఇచ్చిన క్లారిటీతో ఆ వార్తలకు చెక్ పడిందని అనుకొంటున్నారు..