Telugu News » GVL Narasimha Rao : బీజేపీ పై విశాఖ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..!

GVL Narasimha Rao : బీజేపీ పై విశాఖ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..!

విశాఖలో మూడేళ్ళుగా ఉంటూ.. మీ అందరిలో ఒకరిగా కలిసిపోయానని తెలిపారు.. పదవి దక్కకపోయినంత మాత్రాన ప్రజలకు దూరం అవనని.. అన్ని సమస్యలపై పోరాడుతానని వెల్లడించారు..

by Venu

ఏపీలో రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి.. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించిన నేతలకు.. బీజేపీ (BJP), తెలుగుదేశం (TDP), జనసేన (Janasena) పొత్తు పంటికింద రాయిలా మారిందని అనుకొంటున్నారు.. అదేవిధంగా సీట్ల పంపకంలో కొందరికి అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలో ఒక కీలక నేత ఉన్నారు.. ఆయనే ఎంపీ (MP) జీవీఎల్ నరసింహరావు (GVL Narasimha Rao)..

రాబోయే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్న ఆయనకు బీజేపీ అధిష్టానం హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మూడు ప్రధాన పార్టీల పొత్తుల్లో భాగంగా విశాఖ సీటును టీడీపీకి.. రాజమండ్రి సీటును బీజేపీకి కేటాయించినట్లు సమాచారం. కాగా రాజమండ్రి నుంచి బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. దీంతో జీవీఎల్ ఆశలు నీటి మీద కాగితపు పడవలుగా మారాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎంపీ జీవీఎల్ నేడు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సీటు దక్కకపోవడంపై బాధపడిన విషయాన్ని తెలియచేస్తూ.. భవిష్యత్తులో కూడా విశాఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.. విశాఖ (Visakhapatnam) లోక్‌సభ టికెట్ తనకు రానందుకు చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెంది ఫోన్ చేస్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు..

విశాఖలో మూడేళ్ళుగా ఉంటూ.. మీ అందరిలో ఒకరిగా కలిసిపోయానని తెలిపారు.. పదవి దక్కకపోయినంత మాత్రాన ప్రజలకు దూరం అవనని.. అన్ని సమస్యలపై పోరాడుతానని వెల్లడించారు.. తన పరిధిలో ఉన్న కొన్ని సమస్యలను ఇప్పటికే పరిష్కరించానని ఎంపీ తెలిపారు.. తాను చేసిన సేవ నిస్వార్థమైనదని.. వృథా అయిందని ఎవరైనా భావిస్తే అది తప్పు అని పేర్కొన్నారు.. విశాఖతో పాటు.. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరేలా కార్యాచరణ రూపొందించుకుందామన్నారు..

You may also like

Leave a Comment