రంగుల పండుగ హోలీ కొందరి జీవితాల్లో చీకటిని నింపింది. ఆనందంగా రంగులు పూసుకొని చివరికి అందని లోకాలకు వెళ్ళేలా చేసింది. వారి కుటుంబం లో తీవ్ర విషాదం నెలకొనేలా చేసింది.. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో చోటు చేసుకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. హోలీ ఆడిన అనంతరం స్నానం కోసమని కొమురంభీం జిల్లా కౌటాల మండలం వార్ధా నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మరణించారు.

మరోవైపు కీసర (Keesara) పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం ఈతకు వెళ్ళిన విద్యార్థి నీట మునిగి మృత్యువాత పడ్డాడు.. బండ్లగూడ, అహ్మద్ గూడ చెరువులో సరదాగా ఈతకు వెళ్ళిన విద్యార్థి నరేష్(12) ఈత రాక మునిగి మరణించాడు.. ఇతను రాంపల్లి, శాంతినికేతన్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడని సమాచారం.. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా హోలీ వేడుకల్లో పలుచోట్ల విషాదాలు నెలకొన్నాయి..
హోలీ వేడుకలకు వెళుతున్న భార్యభర్తలు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకోచోట వాటర్ ట్యాంక్ పగలి యువతి పై పడటంతో ఆమే అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. మొత్తానికి ఆనందంగా జరుపుకోవలసిన హోలీ పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.