హైదరాబాద్ (Hyderabad)లో వెలుగులోకి వచ్చిన మరో భారీ మద్యం కుంభకోణం (Liquor Scam)టానిక్ లిక్కర్ మార్ట్ (Tonic Liquor Mart).. ఈ స్కామ్ లో తీగ లాగితే డొంక కదులుతోంది. టానిక్ ఎలైట్ వైన్స్ ల సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఈ గ్రూప్ రూ.100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు కనుగొన్నారు.

ఇదిలా ఉండగా టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం గత ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ అజయ్ మిశ్రా (Ajay Mishra) 2016లో జీవో విడుదల చేశారు. జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్ అడ్రస్ తో.. అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో లైసెన్స్ జారీ చేశాడు. మరోవైపు టానిక్ లిక్కర్ మార్ట్కు ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా బీఆర్ఎస్ కి చెందిన ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ ఎంపీ ఆధీనంలో ఈ ఎలైట్ వైన్ షాప్ ఉన్నట్లు సమాచారం..
దీంతో భారీ మినహాయింపులతో కూడిన జీవో విడుదల చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అదీగాక రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలకు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంది.. కానీ ఈ టానిక్ ఎలైట్ వైన్ షాప్కు మాత్రం అర్ధరాత్రి 12 గంటల వరకూ పర్మిషన్ ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. మరోవైపు విదేశీ మద్యం విషయంలోనూ టానిక్కు స్పెషల్ పర్మిషన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పైగా అన్ని వైన్స్లకు టెండర్లు వేస్తే.. ఈ ఎలైట్ వైన్షాప్కు మాత్రం ఎలాంటి టెండర్ లేకుండానే అత్యంత ఖరీదైన ప్రాంతంలో అనుమతివ్వడం భారీ అవినీతికి నిదర్శనంగా నిలిచింది.