Telugu News » Betting : స్పందనలో ఫిర్యాదు…రూ. 400 కోట్ల బెట్టింగ్ గుట్టురట్టు

Betting : స్పందనలో ఫిర్యాదు…రూ. 400 కోట్ల బెట్టింగ్ గుట్టురట్టు

ఈ ముఠాకు చెందిన 11 మంది బెట్టింగ్ సభ్యులను అరెస్ట్ చేసినట్లు... మరికొందరి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు విశాఖ డీసీపీ కంచి శ్రీనివాసరావు తెలిపారు.

by Prasanna
betting

విశాఖ (Visakhapatnam) లో ఆన్లైన్ బెట్టింగ్ (Betting) గుట్టురట్టైయ్యింది. ఇది అంతర్జాతీయ (International) స్థాయిలో జరుగుతున్న బెట్టింగని పోలీసులు తెలిపారు. తాము పట్టుకున్నప్పటికీ ఈ ముఠా చేస్తున్న బెట్టింగ్ విలువ సుమారు రూ. 370 నుంచి రూ. 400 కోట్లు ఉంటుందని విశాఖ పోలీసులు తెలిపారు.

betting

ఈ ముఠాకు చెందిన 11 మంది బెట్టింగ్ సభ్యులను అరెస్ట్ చేసినట్లు… మరికొందరి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు విశాఖ డీసీపీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు ఈ బెట్టింగ్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

విశాఖ డీసీపీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం…

ఇటీవల నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తాను బెట్టింగ్ లో మోసపోయినట్లు ఎర్ర సత్తిబాబు అనే వ్యక్తి పిటిషన్ ఇచ్చాడు. బాధితుడు సత్తిబాబు బ్యాంక్ అకౌంట్స్ లావాదేవీల ఆధారంగా ఈ డబ్బులు ఏ ఖాతాలోకి వెళ్లాయో గుర్తించాం. సూరిబాబు అనే బుకీ ఖాతాకు సత్తిబాబు రూ. 8 లక్షల రూపాయలు పంపించినట్లు తేలింది. సూరిబాబు బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు ఎవరికి వెళుతున్నాయో లోతుగా దర్యాప్తు చేపట్టగా ఈ బెట్టింగ్ ముఠాలో అసలు సూత్రదారుల వివరాలు బయటపడ్డాయి.

వీటితో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసాలకు పాల్పడున్న 11 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశాం. ఈ ముఠాలో ప్రధాన నిందితులు దినేష్ అలియాస్ మోను, వాసుదేవరావు అని తేలింది. వీరు కరెంట్ అకౌంట్స్ తో పాటు ఫేక్ అకౌంట్స్ ఉపయోగించి డబ్బులను కొల్లగొడుతున్నారు. ఇలా ఈ బెట్టింగ్ ముఠా 63 బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించారు. వీటి ద్వారా రూ.367 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు  లావాదేవీలు జరిపినట్లు గుర్తించాం. 32 అకౌంట్స్ లో ఇంకో రూ. 75లక్షలు ఉండటంతో ఆయా బ్యాంకులను సంప్రదించి అకౌంట్స్ ఫ్రీజ్ చేయించాం.

ఈ బెట్టింగ్ ముఠాలో అనకాపల్లి జిల్లాకు చెందిన సూరిబాబు కీలకంగా వ్యవహరించేవాడని విశాఖపట్నం పోలీసులు గుర్తించారు. మొదట వివిధ ఆన్ లైన్ యాప్స్ లో బెట్టింగ్ పెట్టడం ప్రారంభించిన సూరిబాబు కొద్ది రోజులకే బుకీగా మారిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు, ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ నిర్వహించేవాడు. ఒక్కో మ్యాచ్ కు 20 నుండి 30 మందితో బెట్టింగ్ ఆడిస్తూ నాలుగైదు లక్షలు జమ చేసేవాడు. ఇలా ఏడాదికి ఎంతలేదన్నా రూ.5 నుండి 6 కోట్ల లావాదేవీలు జరిపేవాడు. ఈ బెట్టింగ్ డబ్బులను ఎవరికీ అనుమానం రాకుండా ఓ టూర్స్ ఆండ్ ట్రావెల్స్ యజమాని దినేష్ కు పంపించేవాడు. ఈ బెట్టింగ్ వ్యవహారం కొన్నేళ్లుగా కొనసాగుతుండగా తాజాగా బయటపడింది.

 

You may also like

Leave a Comment