పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి.. నేతలు అధికారంలో ఉన్న, మరో సారి అధికారం చేబడుతుందని భావిస్తున్న పార్టీలోకి మారుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యేతో సహా కీలకమైన 100కు పైగా నేతలు బీజేపీ కండువా కప్పుకొన్నారు.. లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా తీర్చిదిద్దాలని, దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలనుకునే వారికి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. అలాగే కాంగ్రెస్ లో బంధుప్రీతి మాత్రమే కనిపిస్తోందని విమర్శలు గుప్పించ్చిన ఆయన.. బీజేపీ ప్రజాస్వామ్య రాజకీయాలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో చింద్వారాతో సహా మొత్తం 29 స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోసారి మోడీ (Modi) అధికారంలోకి రావడం ఖాయని తెలిపిన మోహన్ యాదవ్.. మాజీ సీఎం కమల్ నాథ్ పై వ్యంగాస్త్రాలు వదిలారు.. ఓట్లు అడిగేందుకు తన ఇంటి నుంచి మొదటిసారిగా పెద్ద మహారాజ్ చేతులు జోడించి బయటకు వచ్చారన్నారు. అతని చింద్వారా (Chindwara) మోడల్ ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందని ఎద్దేవా చేశారు..