Telugu News » Nara Lokesh : సెప్టెంబర్ 29న మళ్లీ వస్తున్నా: నారా లోకేష్

Nara Lokesh : సెప్టెంబర్ 29న మళ్లీ వస్తున్నా: నారా లోకేష్

by Prasanna
Nara lokesh

టీడీపీ యువనేత నారా లోకేష్( Nara Lokesh ) యువగళం (Yuvagalam) పాదయాత్ర సెప్టెంబర్ 29వ తారీకు నుంచి మళ్లీ మొదలు టీడీపీ పార్టీ తెలిపింది. ఈనెల 29న తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారు. కొన్ని వారాల క్రితం చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సెప్టెంబర్ 9న పాదయాత్ర ఆపేయడం జరిగింది.ఆ తరువాత లోకేష్ చంద్రబాబుకి( Chandrababu Naidu ) బెయిల్, ఇతర అనేక విషయాలకు సంబంధించి ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు.

Nara lokesh

కాగా ఇప్పుడు మళ్ళీ 20 రోజుల తర్వాత “యువగళం” పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం పోస్ట్ పెట్టింది. “అద్భుత ప్రజాదరణతో జైత్రయాత్రలా కొనసాగుతోన్న యువగళం పాదయాత్ర చంద్రబాబు గారి అక్రమ అరెస్టు కారణంగా ఆగింది. కానీ అది చిన్న విరామం మాత్రమే. ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ సెప్టెంబర్ 29, 2023, రాత్రి 8.15 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తున్నారు నారా లోకేష్ గారు.” అని ఆ పోస్టులో ప్రకటించారు.

అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ ను ఏ14 చేరుస్తూ సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. దీనిపై స్పందించిన లోకేష్, తన యువగళానికి వస్తున్న స్పందన చూసి భయపడిపోయి వైసీపీ తనని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుందని అన్నారు.

యువగళం మళ్లీ ప్రారంభం కాబోతుందని పార్టీ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు లోకేష్ పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు లోకేష్ పాదయాత్రలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

 

You may also like

Leave a Comment