Telugu News » Rangareddy : నార్సింగిలో ఘోర ప్రమాదం.. ఔటర్ రింగ్ రోడ్‌ నుంచి కింద పడ్డ కారు..!

Rangareddy : నార్సింగిలో ఘోర ప్రమాదం.. ఔటర్ రింగ్ రోడ్‌ నుంచి కింద పడ్డ కారు..!

గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొన్నారు. కేసు నమోదు చేసుకొని క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

by Venu

రంగారెడ్డి (Rangareddy) జిల్లా నార్సింగి (Narsingi)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఓఆర్ఆర్‌పై అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పై నుంచి కింద పడింది. ఈ కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ప్రమాదంలో ఒకరు స్పాట్ లో మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.

Road Accident: Bloody roads.. Seven dead..!

కాగా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొన్నారు. కేసు నమోదు చేసుకొని క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం అతివేగమని భావిస్తున్నట్లు వెల్లడించారు.

వేగంగా రావడం వల్లే అదుపుతప్పి ప్రమాదం చోటు చేసుకొందని ప్రాధమిక నిర్థారణకు వచ్చారు.. మరోవైపు ట్రాక్టర్ ను ఢీకొని హెల్త్ జూనియర్ అసిస్టెంట్ మృతి చెందిన ఘటన మెదక్ (Medak)లో చోటు చేసుకొంది. స్థానికుల సమాచారం ప్రకారం.. సుజీత్ (22) అనే యువకుడు కౌడి పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి విధులు ముగించుకొని మోటార్ బైక్ పై ఇంటికి వెళ్తుండగా స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ట్రాక్టర్ ను ఢీ కొట్టినట్టు సమాచారం.

ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్న స్థానికులు గమనించి వెంటనే కుటుంబీకులకు సంచారం ఇవ్వడంతో, వారు చికిత్స కోసం హైదరాబాద్‌ (Hyderabad) గాంధీకి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ సుజీత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై మృతుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభినట్లు సమాచారం..

You may also like

Leave a Comment