Telugu News » Satyavathi Rathod : కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్‌ మంత్రి..!?

Satyavathi Rathod : కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్‌ మంత్రి..!?

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి సత్యవతి అన్నారు.. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను కేసీఆర్ తీసుకొచ్చారని తెలిపారు.

by Venu

తెలంగాణ (Telangana)లో కారు పార్టీ ప్రచారంలో వేగం పెంచింది. ఈ క్రమంలో నేతలు ఓటర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం వార్తలో నిత్యం కనిపిస్తూనే ఉంది. కారు జోరు ప్రతి పక్షాల బేజారు అనే రీతిలో బీఆర్ఎస్‌ (BRS) ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యంలో ప్రతిపక్షాలను విమర్శించడంలో బీఆర్ఎస్‌ నేతలు దూకుడు పెంచారు. ఈ క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) కేసీఆర్ (KCR)పై కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి సత్యవతి అన్నారు.. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను కేసీఆర్ తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సాయం చేసి కేసీఆర్ అండగా నిలబడ్డారని.. కాళేశ్వరం నిర్మించి రైతులకు నీళ్ల కష్టాలు తీర్చారని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు..

కాంగ్రెస్, బీజేపీ ప్రజలను మోసం చేసే పార్టీలే అని మంత్రి విమర్శించారు. మహబూబాబాద్ (mahabubabad) జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా.. అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి తోడ్పాటు అందిస్తున్నారని సత్యవతి అన్నారు.. ఈ సందర్భంగా కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఈ నెల 27న మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

You may also like

Leave a Comment