ప్రస్తుతం దేశంలో కచ్చతీవు (Katchatheevu) దీవుల అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. గత వారం రోజుల ముందు ప్రధాని మోడీ (Modi)తో పాటు బీజేపీ (BJP) ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.. 1970లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం భారత్కి చెందిన హిందూ మహాసముద్రంలోని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంక (Sri Lanka)కు అప్పగించిందని ఆరోపిస్తోంది.

మరోవైపు వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న ఈ దీవుల్ని శ్రీలంకకు అప్పగించడంతో తరుచుగా తమిళనాడు మత్స్యకారులను ఆ దేశ నేవీ అరెస్ట్ చేయడంతో పాటు బోట్లను జప్తు చేయడం వారికి ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కచ్చతీవు వివాదంపై శ్రీలంక విదేశాంగ మంత్రి స్పందించారు. ఈ ద్వీపానికి సంబంధించిన సమస్య పరిష్కారమైందని, ఎలాంటి వివాదం లేదని అలీ సబ్రీ వెల్లడించారు.
ఈ సమస్య 50 ఏళ్ల క్రితమే పరిష్కారమైందని తెలిపిన ఆయన మళ్లీ ఈ అంశం తెరపైకి తీసుకురావలసిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే కచ్చతీవుపై ఇప్పటి వరకు చర్చించలేదని క్యాబినెట్ అధికార ప్రతినిధి, సమాచార మంత్రి బందుల గుణవర్ధన మీడియాకు తెలిపారు.. ఇదిలా ఉండగా ఈ వివాదంపై శ్రీలంక మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర స్పందన కనిపించినప్పటికీ, ప్రభుత్వ పరంగా పెద్దగా స్పందన లేనట్లుగా తెలుస్తోంది.