Telugu News » యానిమల్ సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

యానిమల్ సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

by Sravya
animal-movie

యానిమల్ సినిమా నుండి తాజాగా ట్రైలర్ వచ్చింది రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో యానిమల్ సినిమా తెరమీదకి రాబోతుంది. యాక్షన్స్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. యానిమల్ ట్రైలర్ హిందీ వెర్షన్ కి ఏకంగా 48 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యానిమల్ సినిమా ట్రైలర్ కి తెలుగులో 6.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ సినిమాని మిస్ చేసుకున్న నటుడు ఎవరు అనేది ప్రస్తుతం వైరల్ అవుతోంది.

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు యానిమల్ సినిమా ని మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఇదివరకు పుష్ప సినిమాని మహేష్ బాబు మిస్ చేసుకున్నారు. ఇప్పుడు యానిమల్ సినిమాని కూడా వదులుకున్నారు. యానిమల్ సినిమాను మహేష్ బాబు చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడు ప్రేక్షకులు ఫీలవుతున్నారు. అయితే మరికొందరు మాత్రం మహేష్ బాబుకి ఇటువంటి సినిమాలు సెట్ కావని ఆయన కూడా అదే ఫీల్ అయి ఉండి ఈ సినిమాని ఒప్పుకోలేదని అంటున్నారు.

Also read:

రాజమౌళి తో మహేష్ సినిమా చేస్తున్నారని అభిమానులు హ్యాపీ అవుతున్నారు. భవిష్యత్తులో మహేష్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని కూడా కొందరు కామెంట్లు చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో అయినా మహేష్ బాబు భారీ సినిమాలు చేసి ఆకట్టుకుంటారో లేదో చూడాలి. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు.

You may also like

Leave a Comment