Telugu News » Tummala :  ప్రజలు ఎప్పుడూ నా వైపే: తుమ్మల

Tummala :  ప్రజలు ఎప్పుడూ నా వైపే: తుమ్మల

జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తనను ఒప్పించి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారన్నారు.

by Prasanna
tummala

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునిగేపల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వర రావు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని ప్రజలను ఇబ్బందులు పెడితే వచ్చే ఎన్నికల్లో వారి జన్మ ముగుస్తుందని వ్యాఖ్యానించారు.. జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తనను ఒప్పించి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారన్నారు.

tummala
రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచీ తనకు వచ్చిన అవకాశాలతో నిరంతరం ప్రజల అభివృద్ధి కోసమే రాజకీయాలు చేశానని చెప్పారు. తన స్వార్ధం కోసం ఏనాడు రాజకీయాలు చేయలేదన్నారు. మంత్రిగా పాలేరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తీర్చే అవకాశం తనకు కలిగిందన్నారు.

సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని తుమ్మల గుర్తుచేశారు. వాళ్ళ జాగీరు అనుకునే పరిపాలన వద్దని ప్రజాస్వామ్య హితంగా పాలించే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం విజయం సాధించినట్టని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గోదావరి నీళ్లు తీసుకొచ్చి పాలేరులో నింపుతానన్నారు తుమ్మల తెలిపారు. ప్రజల అవసరాలకు ఏం చెయ్యాలో అదే చేశాననీ ప్రజలకు అనుగుణంగా పనిచేశానని తెలిపారు. ప్రజలకు మరింత సేవచేయాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానన్నారు. శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీని గెలిలించడానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం తనకెప్పుడూ ఉంటుందన్నారు.

You may also like

Leave a Comment