Telugu News » Modi : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఉగ్రవాదుల ధైర్యం పెరుగుతోంది….!

Modi : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఉగ్రవాదుల ధైర్యం పెరుగుతోంది….!

దేశంలో నక్సలైట్ల హింసను అరికట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

by Ramu

దేశంలో కాంగ్రెస్ (Congress) ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మావోయిస్టులు (Maoist), ఉగ్రవాదుల (Terrorists) బలం పెరుగుతుందని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో నక్సలైట్ల హింసను అరికట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల బెడదను తగ్గించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఫైర్ అయ్యారు.

 

చత్తీస్‌గఢ్‌లో రెండో దశ ఎన్నికల కోసం ప్రధాని మోడీ ఈ రోజు ప్రచారాన్ని నిర్వహించారు. బహిరంగ ర్యాలీలో పాల్గొని ప్రధాని మోడీ మాట్లాడుతూ…. ‘నేను ప్రజలకు సేవచేసేందుకే పుట్టాను. మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించారు’అని అన్నారు. చత్తీస్ గఢ్‌లో మావోయిస్టుల బెడద ఉందన్నారు.

మావోయిస్టుల బెడదను తగ్గించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఆదివాసీల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ఆదివాసి కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి అవుతారని ఎవరైనా ఊహించారా అని ప్రజలను ఆయన అడిగారు.

గిరిజన కుటుంబాలకు చెందిన చాలా మంది మహిళలు అదృశ్యమవుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బుజ్జగింపు, ఉదాసీన రాజకీయాల ఫలితంగా రాష్ట్రంలోని సుర్గుజా ప్రాంతంలో పండుగలు జరుపుకోవడం అత్యంత కష్టంగా మారిందన్నారు. ఇధి ఇలా వుంటే ఈ రోజు చత్తీస్‌గఢ్‌లో మొదటి విడత పోలింగ్ జరుగుతోంది.

You may also like

Leave a Comment