Telugu News » Crime : ఇంటిగోడ కూలి ముగ్గురి మృతి

Crime : ఇంటిగోడ కూలి ముగ్గురి మృతి

గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.  

by Prasanna
Hanuma konda

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో (Rains) జనజీవనం స్తంభించిపోవడమే కాదు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. హనుమకొండ (Hanuma Konda) జిల్లాలోని శాయంపేట మండల కేంద్రంలో భారీ వర్షాలకు ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Hanuma konda

గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నానిన ఇంటి గోడ ఇవాళ కూలిపోయింది. దీంతో ఇంట్లోఉన్న ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మండల కేంద్రానికి చెందిన మోర పెద్ద సాంబయ్య, లోకపోయిన సారమ్మ, భోగి జోగమ్మ మృతి చెందినట్లుగా తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment