Telugu News » వయసు చూస్తే 54 ఏళ్ళు.. మేకప్ వేసి 30 ఏళ్ళ అమ్మాయిలా పెళ్లి.. ఆఖరికి..?

వయసు చూస్తే 54 ఏళ్ళు.. మేకప్ వేసి 30 ఏళ్ళ అమ్మాయిలా పెళ్లి.. ఆఖరికి..?

by Sravya

ఈరోజుల్లో మోసాల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ముఖ్యంగా పెళ్లి చేసుకునేటప్పుడు ఏవేవో కారణాలు చెప్పేసే దాటేస్తూ పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత గుట్టు అంతా బయటపడుతుంది. చాలామంది ఇలా మోసపోయిన వాళ్ళు ఉన్నారు మేకప్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎవరు మేకప్ వేసుకున్నా ఎంతో అందంగా కనబడతారు. ఒక సినిమా యాక్టర్ లా కనబడుతుంటారు. ఈమె అమ్మాయి కూడా కాదు ఏకంగా 54 సంవత్సరాలు ఉన్న ఒక మహిళ. ఒక వ్యక్తిని మోసం చేసి పెళ్లి చేసుకుంది తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా చెందిన ఇంద్రాణి అనే ఒక మహిళా తన కొడుకుతో కలిసి ఉంటోంది. ఇంద్రాణి కొడుకు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతనికి పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్నాడు.

అతనికి రెండవ పెళ్లి చేయాలనీ అనుకుంది. గత ఆరేళ్లు కలిసి సంబంధాలు వెతుకుతున్న ఆమెకి తిరుపతికి చెందిన శరణ్య అనే ఒక మహిళ పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా పరిచయమైంది ఆమె వయసు 54 ఏళ్ళు. ఆమెని చూడడానికి వస్తున్నామని కబురు పంపారు. శరణ్య మేకప్ వేసుకొని 30 సంవత్సరాల వయసు ఉన్న ఆమెలా కూర్చుంది. పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకున్నారు. భారీగా ఖర్చు చేసి పెళ్ళికూడా చేశారు గట్టిగా బంగారం కూడా పెట్టారు. తీరా పెళ్లి చేసిన తర్వాత ఆమె అసలు కథ బయటపడింది. అత్త భర్తలని వేధించడం మొదలుపెట్టింది. శాలరీ మొత్తం తన చేతిలోనే పెట్టాలని చెప్పింది.

Also read:

Wedding Season: The wedding season is here.. these are the best moments..!

బీరువా తాళాలని ఆమెకి ఇచ్చేయాలని చెప్పింది. అత్త ఇంద్రాణిని కొట్టేది. భర్త ఆమె పేరు మీద ఆస్తి రాయిస్తానని ఆధార్ కార్డు ఇవ్వమని అన్నారు. ఆధార్ కార్డులో కేరాఫ్ రవి అని ఉండడాన్ని గమనించి భర్తకి అనుమానం వచ్చింది. ఇంద్రాణి ఆమె కొడుకు కలిసి కేసు వేశారు. దీంతో ఆమెకి రవి అనే వ్యక్తితో ఇదివరకు పెళ్లయిందని పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. ఆమె ఇది వరకు రవి పై కూడా కేసు పెట్టి 10 లక్షలు లాగేసుకుంది. ఇలా ఈమె పెళ్లిళ్ల బ్రోకర్లని సంప్రదించి యువకులకు మోసం చేసి డబ్బు గుంజుతోందని అని అర్థమైంది.

You may also like

Leave a Comment