Telugu News » BREAKING: అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి..!

BREAKING: అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి..!

వరుణ్‌రాజ్‌(29)ను ఓ దుండగుడు కత్తితో పొడిచిన సంగతి తెలిసిందే. దీంతో తీవ్రగాయాలతో ఉన్న ఆ యువకున్ని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

by Mano
Breaking: Khammam student stabbed in America

అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్‌(29)ను ఓ దుండగుడు కత్తితో పొడిచిన సంగతి తెలిసిందే. దీంతో తీవ్రగాయాలతో ఉన్న ఆ యువకున్ని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

Breaking: Khammam student stabbed in America

వరుణ్ ఇంటివద్ద విషాదఛాయలు అలముకున్నాయి. ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వరుణ్ ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అక్టోబర్ 31న ఇండియానాలోని వ‌ల్ప‌రైసో సిటీలో ఉన్న జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఓ దుండగుడు కత్తితో వరుణ్ కణతపై పొడిచాడు.

వెంటనే వరుణ్‌ను స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వరుణ్‌కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

వరుణ్ తండ్రి రామ్మూర్తి మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దాడికి గ‌ల కార‌ణాల గురించి అధికారులు విచారిస్తున్నారు. అటాక్ తర్వాత దాడి చేసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదివరకే హ‌త్యాయ‌త్నం కింద కేసు బుక్ చేశారు. ఫోర్ట్ వెయిన్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న‌కు చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు.

You may also like

Leave a Comment