Telugu News » Kidnap : మధ్య ప్రదేశ్‌లో దారుణం… అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్….!

Kidnap : మధ్య ప్రదేశ్‌లో దారుణం… అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్….!

అందరూ చూస్తుండగానే యువతిని బైక్ పై బలవంతంగా ఎక్కించుకుని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

by Ramu
On camera College student abducted in camera

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ​లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్ పట్టణంలో ఓ యువతిని ఇద్దరు దుండగులు కిడ్నాప్ (Kidnap) చేశారు. అందరూ చూస్తుండగానే యువతిని బైక్ పై బలవంతంగా ఎక్కించుకుని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

On camera College student abducted in camera

ఈ ఘటన సోమవారం ఉదయం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దాతియాలోని బారా గ్రామానికి చెందిన యువతి (19) తన అంకుల్ వాళ్ల గృహ ప్రవేశానికి వెళ్లేందుకు బస్సులో గ్వాలియర్ కు వెళ్లారు. ఝాన్సీ రోడ్డులోని ఓ పెట్రోల్ పంపు వద్ద ఆమె బస్సు దిగింది. అక్కడ తన సోదరుని కోసం ఎదురు చూసింది.

ఇంతలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై ఆమె దగ్గరకు వచ్చారు. అందులో ఒకరు బైక్ పై హెల్మెట్ పెట్టుకుని ఉండగా, మరో వ్యక్తి ముఖం కనిపించ కుండా గుడ్డ కట్టుకుని ఉన్నాడు. ఆ ఇద్దరు కలిసి యువతి దగ్గరకు వచ్చి వెంటనే ఆమెను బైక్ పైకి బలవంతంగా ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లి పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బారా ప్రాంతానికి చెందిన రోహిత్ అనే వ్యక్తితో ఇటీవల సదరు యువతికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో యువతి ఇంటికి వచ్చి రోహిత్ గొడవ కూడా చేశాడని పోలీసులు తెలిపారు. దీంతో ఈ కిడ్నాప్ విషయంలో అతని పాత్రపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

You may also like

Leave a Comment