Telugu News » Road Accident: నెత్తురోడిన రహదారులు.. ఏడుగురు దుర్మరణం..!

Road Accident: నెత్తురోడిన రహదారులు.. ఏడుగురు దుర్మరణం..!

అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్(Tanker) ముందు వెళ్తాన్న ఆటో(Auto)ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు.

by Mano
Road Accident: Bloody roads.. Seven dead..!

నల్లగొండ జిల్లా(Nallagonda District) పార్వతీపురం(Parvatipuram) వద్ద ఘోర ప్రమాదం(Road Accident) సంభవించింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్(Tanker) ముందు వెళ్తాన్న ఆటో(Auto)ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు.

Road Accident: Bloody roads.. Seven dead..!

 

స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు కేశవులు, గణ్యా, నాగరాజు, పాండ్యా, బుజ్జిలుగా గుర్తించారు. మరొకరి పేరు తెలియాల్సి ఉంది. అందరూ పెద్దవూర మండలం మల్యవానికుంటతండా వాసులుగా నిర్ధారించారు.

మరో ఘటన.. నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండలం శాఖాపాలేంలో చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి పాదచారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తితో పాటు పాదచారి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందడంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుతాన్ని కోరారు. అదేవిధంగా క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారు.

 

You may also like

Leave a Comment