Telugu News » Hanamkonda : అమ్మ అనే పిలుపుకి మాయని మచ్చ.. కన్న కొడుకుని చంపాలనుకొన్న తల్లి..?

Hanamkonda : అమ్మ అనే పిలుపుకి మాయని మచ్చ.. కన్న కొడుకుని చంపాలనుకొన్న తల్లి..?

రికొందరైతే ఊహించని అఘాయిత్యాలకి సైతం పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం హనుమకొండలో ప్రియుడి మోజులో పడి.. ఓ మహిళ తన కన్న కొడుకునే చంపాలనకొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మ అనే పిలుపుకి మాయని మచ్చగా మారిన ఈ అరాచకం గురించి తెలుసుకొంటే..

by Venu

ఏదేమైనా ఓ రిలేషన్‌లోకి అడుగుపెట్టాక.. దానికంటూ విలువనివ్వాలి. కానీ నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. అందుకే భార్య, భర్తల మధ్య దూరం పెరగడం జరుగుతోందని మానసిక నిపుణులు అంటున్నారు.. అయితే ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోవడానికి ఎన్నో కారణాలను వారు తెలుపుతున్నారు. ఈ ఇల్లీగల్ రిలేషన్ వల్ల సమాజంలో విలువ తగ్గడమే కాదు.. కుటుంబం కూడా నలుగురిలో నవ్వుల పాలవుతోందని పేర్కొంటున్నారు.

మరికొందరైతే ఊహించని అఘాయిత్యాలకి సైతం పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం హనుమకొండలో ప్రియుడి మోజులో పడి.. ఓ మహిళ తన కన్న కొడుకునే చంపాలనకొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మ అనే పిలుపుకి మాయని మచ్చగా మారిన ఈ అరాచకం గురించి తెలుసుకొంటే..

హనుమకొండ (Hanamkonda)..జులైవాడ (Julywada)లో ఉంటున్న ఓ మహిళ.. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం (Extramarital Affair) పెట్టుకుంది. ఈ క్రమంలో కన్నకొడుకు అడ్డుగా ఉన్నాడనే కోపంతో.. ప్రియుడితో కలిసి కొడుకును చిత్ర హింసలు పెట్టింది. వారి చిత్రహింసలను తట్టుకోలేక ఆ బాలుడు పెద్దగా ఏడ్వడంతో.. చుట్టుప్రక్కల వారు వారింటికి వచ్చి చూడగా.. అసలు నిజం బయటకి వచ్చిందని స్థానికులు తెలిపారు.

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి బాలుడిని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు..

You may also like

Leave a Comment