Telugu News » Kamareddy: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి బైఠాయింపు..!

Kamareddy: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి బైఠాయింపు..!

ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బంధువులతో పాటు ధర్నాకు దిగింది. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) బీబీపేట్(BBPet) మండలంలో చోటుచేసుకుంది.

by Mano
Kamareddy: Girlfriend's Baithaimpu in front of boyfriend's house..!

ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బంధువులతో పాటు ధర్నాకు దిగింది. తాళం వేసి ఉన్న ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) బీబీపేట్(BBPet) మండలంలో చోటుచేసుకుంది.

Kamareddy: Girlfriend's Baithaimpu in front of boyfriend's house..!

వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్(Prashanth) అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. నాలుగేళ్లుగా వీరి ప్రేమాయణం సాగింది. ఈ క్రమంలో ప్రశాంత్ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు ప్రియుడి ఇంటికి వెళ్లి విషయాన్ని ప్రియుడి కుటుంబ సభ్యులకు వివరించింది. అయినా ప్రియుడి కుటుంబసభ్యులు స్పందించకపోవడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించింది.

తనను ప్రశాంత్‌ శారీరకంగా వాడుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బీబీపేట పోలీసులు ప్రశాంత్‌పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. రెండు నెలల జైలు శిక్ష తర్వాత 10రోజుల కిందట బెయిల్‌పై విడుదలయ్యాడు. ప్రశాంత్‌ను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు కోరింది. దీంతో ప్రశాంత్ నీవల్లే జైలుకు వెళ్లా.. ఇంకా కోర్టు కేసు నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోలేను అంటూ చెప్పాడు. అంతలోనే ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి పరారయ్యాడు.

దీంతో మోసపోయానని గ్రహించిన ప్రియురాలు కుటుంబ సభ్యులతో కలసి తాళం వేసి ఉన్న ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలు, కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. ప్రియుడు ప్రశాంత్ తోపాటు కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లారనేది ఇంకా తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

You may also like

Leave a Comment