Telugu News » CM Jagan :  టిక్కెట్లు ఇవ్వలేను, కానీ మీరూ నా వారే :  జగన్

CM Jagan :  టిక్కెట్లు ఇవ్వలేను, కానీ మీరూ నా వారే :  జగన్

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని సీఎం జగన్ అన్నారు. ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఓ ఎత్తు...వచ్చే 6 నెలల్లో చేయాల్సిన ప్రోగ్రామ్స్ మరో ఎత్తు అన్నారు.

by Prasanna
CM Jagan

రానున్న ఎన్నికల్లో అందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోవచ్చు, టిక్కెట్లు ఇవ్వలేదని మీరు నా మనుషులు కాకపోరు, మీరూ నా వారే, అందరికి తగిన విధంగా గౌరవిస్తాం అని సీఎం జగన్ (CM Jagan)  అన్నారు. మంత్రులు (Ministers), ఎమ్మేల్యేలు, ఎమ్మల్సీలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం (Camp Office) లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై పార్టీ నేతలతో సీఎం సమీక్షించారు.

CM Jagan

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని సీఎం జగన్ అన్నారు. ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఓ ఎత్తు…వచ్చే 6 నెలల్లో చేయాల్సిన ప్రోగ్రామ్స్ మరో ఎత్తు అన్నారు. వచ్చే 6 నెలల ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యం అన్నారు. గేర్ మార్చాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సీఎం జగన్ సూచించారు.

నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలని.. మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులమే అని తెలిపారు. టికెట్లు ఇవ్వనంత మాత్రాన నిరాశ పడొద్దని.. చాలా మందికి టికెట్లు రావొచ్చు, మరికొందరికీ రాకపోవచ్చు.. మరో అవకాశం ఇస్తాం అని సీఎం జగన్ తెలిపారు.

నామినెటేడ్ పదవులు ఇచ్చి వారిని గౌరవిస్తామని చెప్పారు. టికెట్ల అంశంపై ప్రతీ ఒక్కరు తన నిర్ణయాన్ని పెద్ద మనసుతో స్వాగతించాలని జగన్ సూచించారు. చివరి దశ సర్వే జరుగుతున్నాయని.. ప్రజల్లో ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం చేపడతాం అని సీఎం జగన్ సూచించారు. ఇప్పటివరకు చేసిన పనులను…ఇక నుంచి జనాల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

You may also like

Leave a Comment