Telugu News » IBrahimPatnam : మంటకలిసిన మానవత్వం.. మైనర్ బాలికపై అత్యాచారం..!!

IBrahimPatnam : మంటకలిసిన మానవత్వం.. మైనర్ బాలికపై అత్యాచారం..!!

అర్థరాత్రి దాటాక ధర్మేందర్ ని బయటకు నెట్టిన స్నేహితులు మద్యం మత్తులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. తెరుకొన్న ధర్మేందర్ 100 కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

by Venu

నేటి కాలంలో పాపపుణ్యాలు అనేటివి మాట్లాడుకోవడానికి తప్పితే ఆచరించడానికి పనికిరావని కొన్ని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు అనేవి స్వచ్ఛత లేని బూటకపు నాటకాలని ఋజువు అవుతున్నాయి.

 

నమ్మించి ఒకడు, వావివరసలు మరచి ఒకడు, ఏం చేస్తున్నాడో తెలియని మత్తులో ఒకడు ఇలా ఆడవారిని ఆటబొమ్మల్లా మారుస్తున్నారు. ప్రస్తుతం ఒక అమాయకురాలిని దారుణంగా అత్యాచారం చేసిన ఘటన గురించి తెలుసుకొంటే నేడు సమాజం ఎటువైపు ప్రయాణిస్తుందనే ప్రశ్న మదిలో ఉద్భవిస్తోంది. ఆ వివరాలు తెలుసుకొంటే..

బీహార్ రాష్ట్రానికి (Bihar State) చెందిన ధర్మేందర్ (Dharmender), అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (Minor Girl) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పెద్ద చెరువు సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 5న ధర్మేందర్ తన స్నేహితులతో కలిసి తాను ఉంటున్న రూంలో పార్టీ చేసుకున్నారు.

అర్థరాత్రి దాటాక ధర్మేందర్ ని బయటకు నెట్టిన స్నేహితులు మద్యం మత్తులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. తెరుకొన్న ధర్మేందర్ 100 కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై పొక్సో కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

You may also like

Leave a Comment