Telugu News » School Bus : స్కూల్ బస్ బోల్తా.. 30 మంది విద్యార్థులు..!

School Bus : స్కూల్ బస్ బోల్తా.. 30 మంది విద్యార్థులు..!

మౌంట్‌ బాసిల్‌ స్కూల్‌ కు చెందిన బస్ జడ్చర్ల-మహబూబ్‌ నగర్‌ మార్గంలో కొత్త తండా వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 40 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు.

by admin
school-bus-accident-in-mahabubnagar

స్కూల్ (School) కి వెళ్లే పిల్లలు ఏం చేస్తారు. ఉదయమే లేచి రెడీ అవుతారు. మమ్మీ, డాడీలకు టాటా బైబై చెప్పి.. ఎంతో ఆహ్లాదంగా స్కూల్ బస్ ఎక్కుతారు. ఫ్రెండ్స్ ని పలకరించి గుడ్ మార్నింగ్ చెప్పుకుని సరదాగా మాట్లాడుకుంటారు. మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్లకి చెందిన విద్యార్థులు కూడా ఇవాళ ఉదయం ఇదే చేశారు. కానీ, కాసేపట్లో స్కూల్ కి వెళ్తామనగా.. హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది.

school-bus-accident-in-mahabubnagar

మౌంట్‌ బాసిల్‌ స్కూల్‌ కు చెందిన బస్ జడ్చర్ల-మహబూబ్‌ నగర్‌ మార్గంలో కొత్త తండా వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 40 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. బస్ బోల్తా పడడంతో వారిలో 30 మంది దాకా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police).. అక్కడకు చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయకచర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.

బస్ వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో అదుపు తప్పి డివైడర్‌ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు స్థానికులు. విద్యార్థులలో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో వీరికి చికిత్స అందుతోంది. ప్రమాదం కారణంగా.. 167 జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.

తల్లిదండ్రులకు విషయం తెలిసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే, స్కూల్ కు చేరుకుని తమ పిల్లల యోగక్షేమాలు తెలుసుకున్నారు. తర్వాత, ఆస్పత్రికి పరుగులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్‌ ను ప్రమాదం గురించి ఆరా తీశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.

You may also like

Leave a Comment