Telugu News » chittoor : నోటిలో బాంబు.. మద్యం మత్తులో బాబు.. వాట్ నెక్స్ట్..?

chittoor : నోటిలో బాంబు.. మద్యం మత్తులో బాబు.. వాట్ నెక్స్ట్..?

మందు బాబులు మద్యం మత్తులో చేసే పనులు చూసే వారికి ఒకవైపు భయాన్ని, మరోవైపు వినోదాన్ని పరిచయం చేసిన రోజులు కూడా ఉన్నాయి. తాజాగా ఓ మందు బాబు మద్యం మత్తులో బాంబును నోటితో కొరికి ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.

by Venu

నిషా నషాళానికి ఎక్కిన వాడి చేష్టలకు ఒక హద్దు ఉండదు.. ఈ ప్రపంచానికి వాడే బాస్ అనేలా ప్రవర్తిస్తాడు. మద్యం తాగిన వాడి ముందు సింహం వచ్చి నిలబడినా అది తన ఫ్రెండ్ అనేలా ప్రవర్తిస్తాడు. కానీ మద్యం వల్ల జరిగే నష్టాన్ని గుర్తించడు. మద్యానికి బానిసై తమ కుటుంబాలను రోడ్డుకు మీదకు తీసుకొచ్చిన మందు బాబులు ఉన్నారు.. ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. మొత్తానికి ఈ మద్యం వల్ల జరిగే అనర్థాలకు అంతం లేదు..

మరోవైపు మందు బాబులు మద్యం మత్తులో చేసే పనులు చూసే వారికి ఒకవైపు భయాన్ని, మరోవైపు వినోదాన్ని పరిచయం చేసిన రోజులు కూడా ఉన్నాయి. తాజాగా ఓ మందు బాబు మద్యం మత్తులో బాంబును నోటితో కొరికి ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.

చిత్తూరు (chittoor) జిల్లాలో బంగారుపాళ్యం (Bangarupalyam) మండలం గడ్డంవారిపల్లె (Gaddamvaripalle)లో నివసిస్తున్న చిరంజీవి (Chiranjeevi) అనే వ్యక్తి మద్యానికి బానిసగా (Alcoholic) మారాడు. రోజు లాగానే ఈ రోజు కాస్త ఎక్కువ మద్యాన్ని సేవించిన చిరంజీవి ఆ నిషాలో బాంబును నోటితో కొరికాడు. ఆ బాంబు కాస్త పేలడంతో చిరంజీవి తల ఛిద్రమై అక్కడికక్కడే మరణించాడు.

ఈ విషయాన్ని పోలీసులు దృవీకరించారు. మరోవైపు మద్యానికి బానిసైన చిరంజీవితో అతని భార్య గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.. కాగా ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

You may also like

Leave a Comment