Telugu News » Akshay Kumar : మరోసారి గుట్కా యాడ్…. క్లారిటీ ఇచ్చిన అక్షయ్ కుమార్…..!

Akshay Kumar : మరోసారి గుట్కా యాడ్…. క్లారిటీ ఇచ్చిన అక్షయ్ కుమార్…..!

తాజాగా ఆయన ప్రముఖ గుట్కా బ్రాండ్‌కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారంటూ మరోసారి వార్తలు గుప్పు మనడటంతో నెటిజన్లు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

by Ramu

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ను గుట్కా యాడ్ (Gutka Add) ఇబ్బంది పెడుతోంది. రెండేండ్ల క్రితం ముగిసిందనుకున్న గుట్కా యాడ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఆయన ప్రముఖ గుట్కా బ్రాండ్‌కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారంటూ మరోసారి వార్తలు గుప్పు మనడటంతో నెటిజన్లు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై అక్షయ్ కుమార్ స్పందించారు.

 

ఇంతకు ఏం జరిగిందంటే…. ఇటీవల ఓ ప్రముఖ గుట్కా బ్రాండ్‌కు అక్షయ్ కుమార్ మళ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారంటూ ప్రముఖ మీడియా సంస్థ ఒకటి కథనాలు రాసింది. ఆ కథనాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో తాను ఏ గుట్కా బ్రండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించడం లేదంటూ అక్షయ్ కుమార్ స్పష్టం చేశారు.

ఇటీవల బ్రాడ్ కాస్ట్ అయిన ఆ యాడ్ ను 13 అక్టోబర్ 2021న షూట్ చేశారన్నారు. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా తప్పుకుంటున్నట్టు రెండేండ్ల క్రితమే బహిరంగంగా ప్రకటించానని చెప్పారు. ఇప్పటికే షూట్ చేసిన ఆ యాడ్ ను వచ్చే నెల వరకు బ్రాడ్ కాస్టింగ్ చేసుకునేందుకు వాళ్లకు లీగల్ గా అనుమతులు వున్నాయని తెలిపారు. కథనాలు ప్రచురించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని మీడియా సంస్థకు చురకలు అంటించారు.

2021లో ప్రముఖ పాన్ మసాల తయారీ సంస్థకు చెందిన ఓ ఇలాచీ ప్రొడక్ట్ యాడ్‌లో అక్షయ్ కుమార్ నటించారు. ఆ సంస్థ గతంలో గుట్కా ప్రొడక్ట్స్ తయారు చేయడంతో దానిపై నెటిజన్లు మండిపడ్డారు. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటులు ఇలా పాన్ మసాల కంపెనీలను ప్రమోట్ చేయడం సరికాదని నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతో అక్షయ్ కుమార్ ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా తప్పుకుంటున్నట్టు వెల్లడించారు.

You may also like

Leave a Comment