Telugu News » Shivaji : 350 ఏండ్ల తర్వాత భారత్ కు శివాజీ ఆయుధం…..!

Shivaji : 350 ఏండ్ల తర్వాత భారత్ కు శివాజీ ఆయుధం…..!

1659లో బీజాపూర్ (Beejapur) సుల్తానేట్ కు చెందిన జనరల్ అఫ్జల్ ఖాన్ ను ఓడించే సందర్బంలో శివాజీ ఈ ఆయుధాన్ని ఉపయోగించారు.

by Ramu
chhatrapati shivaji maharajs tiger nail will return to india after 350 years know the story

చత్రపతి శివాజీ (Chatrapathi Shivaji) మహారాజ్ ఉపయోగించిన భాఘ్ కీ పంజా ( పులి గోళ్ల)ను భారత్ (India) కు తీసుకు వస్తున్నారు. సుమారు 350 ఏండ్ల తర్వాత శివాజీ ఆయుధం మళ్లీ భారత్ కు చేరుకుంటోంది. 1659లో బీజాపూర్ (Beejapur) సుల్తానేట్ కు చెందిన జనరల్ అఫ్జల్ ఖాన్ ను ఓడించే సందర్బంలో శివాజీ ఈ ఆయుధాన్ని ఉపయోగించారు.

chhatrapati shivaji maharajs tiger nail will return to india after 350 years know the story

తాజాగా దీన్ని భారత్ కు తిరిగి తీసుకు వచ్చే విషయంలో లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్ బర్గ్ మ్యూజియంతో మహారాష్ట్ర సర్కార్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై మంగళవారం మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ సంతకం చేయనున్నాయి. నవంబర్ నెలలో ఇవి భారత్ కు చేరుకుంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అఫ్జల్ ఖాన్ ను శివాజీ ఓడించిన రోజునే ఆ పులి గోళ్లను భారత్ కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంలో ఈ వాఘ్ నఖ్ ను ప్రదర్శనకు పెడతామన్నారు. 1659లో జరిగిన ప్రతాప్‌గఢ్ యుద్ధంలో మరాఠాల విజయం మరాఠా సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించింది.

సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ ఈ యుద్దంలో అఫ్జల్ ఖాన్ నేతృత్వంలోని ఆదిల్షాహి సైన్యాన్ని మరాఠాలు ఓడించారు, ఈ యుద్ధం ద్వారా ఛత్రపతి శివాజీకి అద్భుతమైన సైనిక వ్యూహకర్తగా గొప్ప పేరు వచ్చింది. మొదట ఓ పథకం ప్రకారం శివాజీని అఫ్జల్ ఖాన్ పిలిపించాడని, ఆ తర్వాత దొంగ దెబ్బతీసి కత్తితో పొడిచారని చరిత్ర కారులు చెబుతున్నారు. ఆ వెంటనే శివాజీ ఈ పులి గోళ్లతో అఫ్జల్ ఖాన్ ను హత మార్చాడని అంటున్నారు.

You may also like

Leave a Comment