Telugu News » Dharmasagar : ప్రాణం తీసిన టీ.. గిరిజన మహిళ మృతి..!

Dharmasagar : ప్రాణం తీసిన టీ.. గిరిజన మహిళ మృతి..!

కేసు నమోదు చేసుకొన్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం.

by Venu
America: Tragedy.. Suspicious death of another Indian student in America..!

బయటికి వెళ్ళిన వారు తిరిగి ఇంటికి వస్తారనే నమ్మకం లేని రోజులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.. ఏ క్షణం ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు (Road Accidents) రికార్డు స్థాయిలో నమోదవడం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ గిరిజన మహిళను స్కార్పియో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ధర్మసాగర్ (Dharmasagar), గేట్ తాండాకు చెందిన గమిని (65) టీ తాగడానికి హోటల్‌కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మెదక్ (Medak) వైపు నుంచి నర్సాపూర్ (Narsapur) వెళ్తున్న స్కార్పియో వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. రోడ్డు ప్రమాదం జరిగిన సమాచారం అందుకొన్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొన్నారు.

ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం. ఇక గమిని మృతితో తండాలో విషాదఛాయలు అలుముకొన్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

You may also like

Leave a Comment