Telugu News » Road Accident : ఉత్తర్​ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి..!!

Road Accident : ఉత్తర్​ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి..!!

కారు ప్రమాదంలో మరణించిన వారిలో నాలుగేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని వారు తెలిపారు. మరోవైపు గుజరాత్ లో పోలీసులు వెళ్తున్న వాహనం బోల్తా పడి 38 మంది గాయపడ్డారు.

by Venu

ఉత్తర్​ప్రదేశ్ (Uttar Pradesh)​లో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఉత్తర్​ప్రదేశ్​ హర్డోయ్ (Hardoi) జిల్లా ఖమరియా గ్రామంలో బిల్హౌర్-కత్రా హైవే (Bilhaur-Katra Highway)పై ఈ దారుణం చోటుచేసుకుంది.

ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. కారులో నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు గ్యాస్​ కట్టర్లు వినియోగించినట్లు పేర్కొన్నారు. కాగా బాధితులు బరాకాంత్ గ్రామానికి చెందిన వారని, వీరు బరాకాంత్​ నుంచి నయాగావ్ వెళ్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు..

కాగా కారు ప్రమాదంలో మరణించిన వారిలో నాలుగేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని వారు తెలిపారు. మరోవైపు గుజరాత్ లో పోలీసులు వెళ్తున్న వాహనం బోల్తా పడి 38 మంది గాయపడ్డారు. గుజరాత్​లోని పంచమహల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు చూస్తే..

స్టేట్​ రిజర్వ్ పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్​ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన అధికారులు.. వాహనం బ్రేక్​లు​ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణం అని వెల్లడించారు..

You may also like

Leave a Comment