Telugu News » నాలుగేళ్ల చిన్నారి పై అత్యాచారం..పాప శరీరాన్ని పీక్కుతిన్న కుక్కలు!

నాలుగేళ్ల చిన్నారి పై అత్యాచారం..పాప శరీరాన్ని పీక్కుతిన్న కుక్కలు!

ఆ శవం తన కూతురిదిగా గుర్తించిన పాప తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.

by Sai
four year old girl was raped and dogs ate her body in uttarapradesh

ఉత్తరప్రదేశ్‌ (Uttarapradesh) లోని ఫరూఖాబాద్ (Pharukhabad) లో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపి పొలాల్లో పడేయడంతో పాప శరీరాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. పోలీసులు ఈ దారుణ ఘటన గురించి వివరించారు. ఫరూఖాబాద్‌ లోని తన ఇంటి ముందు ఆరుబయట ఆడుకుంటుంది.

four year old girl was raped and dogs ate her body in uttarapradesh

అయితే కొద్ది సేపటి తరువాత ఆమె కనిపించకుండా పోయింది. బాలిక కోసం కుటుంబ సభ్యులు ఊరంతా గాలించారు. అయితే పొలంలో ఓ కుక్కల గుంపు పొలంలో కలబడుతుండటాన్ని గ్రామస్థులు చూసి అక్కడికి చేరుకోగా..పొలంలో పాప శరీరం కనిపించింది. ఆ శవం తన కూతురిదిగా గుర్తించిన పాప తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.

దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు బాలిక శవాన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలింది. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాను పొలంలో నుంచి వస్తుండగా ఆ చిన్నారి ఆడుకుంటూ కనిపించిందని నిందితుడు తెలిపాడు.

మరో వ్యక్తి సాయంతో బాలికను వేరే పొలంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి చంపేసినట్లు నిందితుడు వెల్లడించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. తమ చిన్నారిని దారుణం చంపిన వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment