సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy )పై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసని చెప్పారు. సీఎం పదవి వచ్చాక కూడా రేవంత్లో మార్పు కనపించడం లేదని మండిపడ్డారు.
కొంచెం హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. దేశానికి తెలంగాణను రోల్ మోడల్గా అభివృద్ధి చేసింది కేసీఆర్ అని పేర్కొన్నారు. అలాంటి కేసీఆర్ను తూలనాడడం కరెక్ట్ కాదని అన్నారు. గతంలో దావోస్ వెళ్లినప్పుడు కేటీఆర్ ఎంతో హుందాగా ప్రవర్తించారని గుర్తు చేశారు.
పెట్టుబడులు సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ను ముక్కలు చేసే వాళ్లు ఇంకా పుట్టలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 50 రోజులకు పైగా రోజులు అవుతోందని తెలిపారు. అప్పటి నుంచి అభివృద్ధిని పక్కనబెట్టి బీఆర్ఎస్పై విమర్శలు చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు చెందుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ను అనవసరంగా ఓడించామని బాధపడుతున్నారని తెలిపారు. సీఎం సహా మంత్రులంతా తిడుతుంటే తాము పడాలా? అని నిలదీశారు. బీఆర్ఎస్ను బొంద పెట్టే మొనగాడు ఇంకా పుట్టలేదని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు.