Telugu News » Student-Suicide : బాలికల గురుకుల పాఠశాలలో ఘోరం.. ఇంటర్ యువతి అలా ఎలా..?

Student-Suicide : బాలికల గురుకుల పాఠశాలలో ఘోరం.. ఇంటర్ యువతి అలా ఎలా..?

దసరా సెలవులకు వెళ్ళిన విద్యార్థిని సోమవారం పాఠశాలకు తిరిగి వచ్చిందని ప్రిన్సిపల్ తెలిపారు. కాగా విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలిసిన ప్రిన్సిపల్ పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు.

by Venu

కామారెడ్డి (Kamareddy)జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్నూర్ మండలం పెద్ద ఎక్లార బాలికల (girls) గురుకుల పాఠశాల (Residential School)లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ (Inter)ఫస్ట్ ఇయర్ చదువుతున్న వసుధ (16) అనే యువతి వసతి గృహంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రిన్సిపల్ తెలిపారు. కాగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వగ్రామం బిచ్కుంద మండలం మానేపూర్ గ్రామం అని పేర్కొన్నారు.

అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.. దసరా సెలవులకు వెళ్ళిన విద్యార్థిని సోమవారం పాఠశాలకు తిరిగి వచ్చిందని ప్రిన్సిపల్ తెలిపారు. కాగా విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలిసిన ప్రిన్సిపల్ పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు.. మరోవైపు వసుధ మృతి చెందిన విషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తూ పాఠశాలకు చేరుకున్నారు.

తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ప్రిన్సిపల్ గది దగ్గర ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, ఆర్డీవో ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పారు.

మరోవైపు వరుసగా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.. కారణం ఏదైనా ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల ఆత్మహత్యలు తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చి జీవితాంతం బాధపడేలా చేస్తుందని మనసున్న వారు ఆవేదన పడుతున్నారు.

You may also like

Leave a Comment