Telugu News » Minister Roja : పురంధేశ్వరి ఒక జగత్ కిలాడీ…. ఆమె లాంటి కూతురు ఎవరికీ పుట్టకూడదు….!

Minister Roja : పురంధేశ్వరి ఒక జగత్ కిలాడీ…. ఆమె లాంటి కూతురు ఎవరికీ పుట్టకూడదు….!

స్కామ్‌ల ద్వారా స్కీమ్‌లను వాడుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

by Ramu

టీడీపీ చీఫ్ చంద్రబాబు (Chandra Babu)పై మంత్రి రోజా (Roja) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. స్కామ్‌ల ద్వారా స్కీమ్‌లను వాడుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రైతు ద్రోహీ చంద్రబాబు నాయుడు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రెయిన్ గన్‌లతో కరువును జయించగలమా అని ఆమె ప్రశ్నించారు.

రెయిన్ గన్‌తో వేలాది ఎకరాలను పండించగలమా అని ఆమె నిలదీశారు. రెయిన్ గన్ విషయంలోనూ చంద్రబాబుపై కేసులు పడతాయని వెల్లడించారు. చంద్రబాబు మరోసారి జైలుకు వెళతారంటూ పేర్కొన్నారు. సీఎం జగన్ పై కేసుల విషయంలో కక్ష సాధింపుల్లో భాగంగానే సుప్రీం కోర్టుకు ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి లేఖ రాశారని ఆరోపించారు.

పురంధేశ్వరి అమె పని అమె చూసుకుంటే బాగుంటుందన్నాురు. పురంధేశ్వరికి ఒక నియోజకవర్గం కూడా లేదన్నారు. ఆమెను చూసి ఎవరైనా ఓటు వేస్తారా అంటూ సెటైర్లు వేశారు. సీఎం జగన్ పై కేసుల గురించి లేఖలు రాయాల్సిన అవసరం లేదని చెప్పారు. తనపై కేసులు విచారించాలని పిటిషన్ పెట్టుకున్న దమ్మున్న నాయకుడు జగన్ అని పేర్కొన్నారు.

మాజీ సీఎం ఎన్టీఆర్ బతికున్న సమయంలో కనీసం ఒక రోజైనా ఆయనకు అన్నం పెట్టి.. నీళ్ళు ఇచ్చావా పురంధేశ్వరి అంటూ ఆమె ప్రశ్నించారు. కేవలం బావ కండ్లల్లో ఆనంద కోసమే ఆమె లేఖలు రాస్తోందన్నారు. పురందరేశ్వరి ఒక జగత్ కిలాడీ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పురంధేశ్వరి లాంటి నీతి మాలినా, జగత్ కిలాడి లాంటి కూతురు ఎవరికి పుట్టకూడదని తాను కోరుకుంటున్నానన్నారు. పురంధేశ్వరి లాంటి కూతురు పుట్టిందని ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఎడుస్తుంటారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

You may also like

Leave a Comment