Telugu News » Uttarakhand Tunnel : సీఎంకు ప్రధాని మోడీ ఫోన్… రెస్క్యూ పనులపై ఆరా…!

Uttarakhand Tunnel : సీఎంకు ప్రధాని మోడీ ఫోన్… రెస్క్యూ పనులపై ఆరా…!

ఈ క్రమంలో తాజాగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ కాల్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ గురించి సీఎంను ఆయన ఆరా తీశారు.

by Ramu
Need To Keep Up Their Morale PM Modi On 41 Stranded In Uttarakhand Tunnel

ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లో టెన్నెల్ (Tunnel) కూలడంతో 41 మంది కార్మికులు అందులో చిక్కుకు పోయారు. వారిని రక్షించేందుకు గత పది రోజులుగా అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ కాల్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ గురించి సీఎంను ఆయన ఆరా తీశారు.

ఈ మేరకు విషయాన్ని సీఎం కార్యాలయం వెల్లడించింది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న విధానం గురించి సీఎంను అడిగి ప్రధాని తెలుసుకున్నారని చెప్పింది. సహాయక చర్యల కోసం కావాల్సిన అత్యవసరమైన యంత్రాలు, వనరులను కేంద్రం అందిస్తోందని ఈ సందర్బంగా ప్రధాని చెప్పారని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో కార్మికులను సురక్షితంగా టన్నెల్ నుంచి బయటకు తీసుకు వస్తామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారని పేర్కొంది.

కార్మికులు మనోధైర్యంతో ఉండాలని ప్రధాని మోడీ సూచించారని ప్రకటనలో వివరించింది. ఈ నెల 12న ఉత్తర కాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలి పోయింది. ఆ సమయంలో 41 మంది కార్మికులు ఆ సొరంగంలో చిక్కుకు పోయారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ తర్వాత టన్నెల్ మరోసారి కూలడం, భారీగా కొండ చరియలు, రాళ్లు పడటంతో సహాయక చర్యలు ఆలస్యం అవుతోంది.

టన్నెల్ లోని కార్మికులకు ఓ పైపు ద్వారా ఆహార పదార్థాలు, తాగునీటిని, ఆక్సిజన్ ను పంపిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం విదేశాల నుంచి ప్రత్యేకమైన డ్రిల్లింగ్ మిషన్లు కూడా తెప్పిచారు. తాజాగా కార్మికులను రక్షించేందుకు ఐదు ప్రణాళికలు రచించినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యాచరణ ప్రణాళికలను ఐదు ఏజెన్సీలు అమలు చేస్తాయని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment