Telugu News » PM MOdi : వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్దిదారులతో ముచ్చటించిన మోడీ…!

PM MOdi : వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్దిదారులతో ముచ్చటించిన మోడీ…!

పలు ప్రభుత్వ పథకాల ద్వారా వారు ఎలా లబ్ది పొందారో, పథకాల విషయంలో వారి అనుభవాల ఎలా ఉన్నాయో ఈ సందర్భంగా ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు.

by Ramu
PM Modi interacts with beneficiaries of ‘Viksit Bharat Sankalp Yatra’ virtually

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర (Viksit Bharat Sankalp Yatra) లబ్దిదారులతో ప్రధాని మోడీ (PM Modi) వర్చువల్ గా ముచ్చటించారు. పలు ప్రభుత్వ పథకాల ద్వారా వారు ఎలా లబ్ది పొందారో, పథకాల విషయంలో వారి అనుభవాల ఎలా ఉన్నాయో ఈ సందర్భంగా ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు.

PM Modi interacts with beneficiaries of ‘Viksit Bharat Sankalp Yatra’ virtually

తాజాగా జన ఔషది కేంద్రాలను 10,000 నుంచి 25,000లకు పెంచే కార్యక్రమాన్ని మోడీ ఈ రోజు ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణను సరసమైన ధరలో, సులభంగా అందుబాటులోకి తీసుకు రావడం హెల్తీ ఇండియా ముఖ్య ఉద్దేశం. సరసమైన తక్కువ ధరలకు ఔషధాలను అందుబాటులో ఉంచడానికి జన్ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈ పథకంలోని ముఖ్య కార్యక్రమాల్లో ఒకటి.

ఇదే కార్యక్రమంలో ప్రధాన మంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ డ్రోన్ పథకం గురించి చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ ఇది అనేక ఇతర మహిళా ఆధారిత సంక్షేమ కార్యక్రమాల లాగానే మహిళలకు సాధికారతనిస్తుందని రుజువు చేసిందని ప్రధాని వెల్లడించారు.

ఈ కార్యక్రమం కింద, మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జి) డ్రోన్‌లు అందించబడతాయి,. వీటిని వారు జీవనోపాధి కోసం ఈ సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా డ్రోన్లను ఎగురవేయడం, వాటిని ఉపయోగించే విధానంపై మహిళకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

You may also like

Leave a Comment