Telugu News » Posani : తప్పుచేసిన వాళ్లను జైల్లోనే పెడతారు:  పోసాని

Posani : తప్పుచేసిన వాళ్లను జైల్లోనే పెడతారు:  పోసాని

అధికారం కోసం పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబని పోసాని విమర్శించారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది ఎవరు? మానసిక క్షోభకు గురిచేసింది ఎవరు?  మరణానికి కారణమైంది ఎవరో తెలుసుకుని మాట్లాడాలన్నారు.

by Prasanna
posani

చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) ని అక్రమంగా అరెస్టు చేశారన్న నారా బ్రాహ్మణి కామెంట్లకు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని (Posani) కృష్ణమురళి కౌంటర్ ఇచ్చారు. తాను అడిగిన ప్రశ్నలకు నారా బ్రాహ్మణి (Nara Brahmini) సమాధానం చెబితే కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడాని కూడా తాను సిద్ధమన్నారు.

posani

అధికారం కోసం పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబని పోసాని విమర్శించారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది ఎవరు? మానసిక క్షోభకు గురిచేసింది ఎవరు?  మరణానికి కారణమైంది ఎవరో తెలుసుకుని మాట్లాడాలన్నారు.

అసత్యాలతో టీడీపీ పార్టీని చేజిక్కించుకుని ఎన్టీఆర్ ను అవమానించిన తీరును ప్రజలెప్పటికీ మరిచిపోరని తెలిపారు. చంద్రబాబు నిజాయితీపరుడంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని పోసాని చెప్పారు. అందుకే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన బాబుకు మద్దతు తెలుపకుండా ప్రజలు తెలివిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నారా బ్రాహ్మణి రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే ములాఖత్ లో కూడా చంద్రబాబును రెండు సార్లు కలిశారు.

You may also like

Leave a Comment