Telugu News » Cruel customer: పాపం ఆ డెలివరీ బాయ్..! ఆర్డర్ లేట్ గా తెచ్చాడని..!?

Cruel customer: పాపం ఆ డెలివరీ బాయ్..! ఆర్డర్ లేట్ గా తెచ్చాడని..!?

ఆర్డర్ చేసినవి..డెలివరీ(Delivery )చేయడం..ఆర్డర్ బుక్ చేసినంత ఈజీ కాదు

by sai krishna

ఆర్డర్  చేసినవి..డెలివరీ(Delivery )చేయడం..ఆర్డర్ బుక్ చేసినంత ఈజీ కాదు.తేవాల్సిన చోట..పార్శిల్ చేయడం లేట్ అవ్వొచ్చు, ట్రాఫిక్ జామ్( Traffic jam) లో ఇరుక్కోవచ్చు.

అడ్రస్ పట్టుకోవడం కష్టం కావొచ్చు, ఏ రోడ్డు సంబంధిత మరమత్తులో జరుగుsp ఉండొచ్చు.లేదా డెలివరీ బాయ్ కే ఆరోగ్యం బాగా లేకపోవచ్చు..ఇలా ఏమైనా జరగొచ్చు! అంత మాత్రం చేత ఆ డెలివరీ బాయ్ ని దుర్భాషలాడొచ్చా..!? తిట్టడ కూడా కాదు.

ఓ పొగరుబోతు కష్టమర్..తన స్నేహితులతో కలిసి డెలివరీ బాయ్ ని దారుణంగా కొట్టి కాలువిరగ్గొట్టాడు.తెలిసిన సమాచారం ప్రకారం మహారాష్ట్ర(Maharastra)లోని నాందేడ్‌(Nanded)కు చెందిన షేక్‌ రహమాన్‌ ఫయాజ్‌ జీవనోపాధి కోసం హైదరాబాద్‌(Hyderabad) వచ్చాడు.

బోరబండ(Borabanda)లో నివాసముంటున్న అతడు ఆరు నెలలుగా ఓ కంపెనీలో డెలివరీ బాయ్‌(Delivery Boy)గా పనిచేస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో కేపీ విశాల్ గౌడ్‌కు చెందిన సరుకులు అందించేందుకు ఫయాజ్ వెళ్లాడు.

చిరునామా తెలియకపోవడంతో స్థానికులను ఆరా తీశారు. ఆర్డర్ తీసుకుని విశాల్ ఇంటికి వెళ్లేసరికి కాస్త ఆలస్యమైంది. అయితే ఎందుకు ఆలస్యం అని ఫయాజ్‌ను విశాల్ గౌడ్ ప్రశ్నించారు.

ఫయాజ్ తన ఆరుగురు స్నేహితులతో కలిసి విశాల్‌ను ఓ గదిలో బంధించారు. ఏడుగురు వ్యక్తులు క్రికెట్ బ్యాట్లతో అతడిని దారుణంగా కొట్టి..వారి ఉన్మాదంతోపాటు, ఫ్రస్ట్రేషన్ కూడా తీర్చుకున్నారు.

అయితే ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కేసు నమోదుపై రెండు వాదనలు వినిపిస్తున్నాయి.తీవ్రగాయాలపాలైన ఫయాజ్ తన స్నేహితుల సాయంతో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా..సరైన స్పందన రాలేదన్నారు.

ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఫయాజ్ నగరంలోని కొందరి సహకారంతో సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను కలిశారని తెలుస్తోంది. తనపై దాడి చేసిన విశాల్ గౌడ్ పై ఫిర్యాదు చేసాడు.

ఎట్టకేలకు సీపీ ఆదేశాల మేరకు గెడిమెట్ల సీఐ కేసు నమోదు చేసినట్లు సమాచారం.మరోవైపు ఫయాజ్ కాలు విరిగిందని..తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.కొట్టడంతో ఇంటికి వెళ్లాడని.. చికిత్స కోసం పట్టణానికి వెళ్లాడని చెప్పారు.

అయితే కోలుకుని ఆగస్టు 10న జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితుడు కేపీ విశాల్ గౌడ్..తన స్నేహితులపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

You may also like

Leave a Comment