Telugu News » టీం ఇండియా కి వేరే బాల్స్ ఇస్తున్నారు.. పాకిస్తాన్ ప్లేయర్ హాసన్ రజా పోస్ట్ వైరల్..!

టీం ఇండియా కి వేరే బాల్స్ ఇస్తున్నారు.. పాకిస్తాన్ ప్లేయర్ హాసన్ రజా పోస్ట్ వైరల్..!

by Sravya
ind vs eng india defeats england by 100 runs

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లలో టీమిండియా అద్భుతంగా దూసుకు వెళ్ళిపోతోంది. టీమిండియా భారీ పరుగులను చేస్తూ ముందుకు వెళ్తోంది. టీమిండియా 302 పరుగులు కూడా చేయడం జరిగింది. పాకిస్తానీ క్రికెటర్ హసన్ రజా గురువారం నాడు పలు విషయాలను చెప్పడం జరిగింది ప్రస్తుతం అవి సంచలనంగా మారాయి పాకిస్తానీ ఆటగాడు హసన్ రజా ఇండియన్ ప్లేయర్లకి వేరే విధమైన బాల్స్ వస్తున్నారని ఐసీసీ లేదా బీసీసీఐ నుండి వాళ్లకి విభిన్నమైన బాల్స్ వస్తున్నట్లు ఆయన చెప్పారు.

ind vs eng india defeats england by 100 runs

కొన్ని స్పెషల్ బాల్స్ ని ఇండియన్ బౌలర్లకి ఇస్తున్నారని బ్యాటింగ్ పిచ్ మీద కూడా బాగా స్వింగ్ అవుతున్నాయని తను చెప్పారు. బాల్స్ విషయంలో ఇన్స్పెక్షన్ చేయాలని కోరారు ఇతర టీములతో ఆడినప్పుడు వేరేలా ఉంటోంది కానీ ఇండియన్ బౌలర్లు బౌలింగ్ చేసినప్పుడు మాత్రం మరోలా ఉంటోందని చెప్పారు. సౌత్ ఆఫ్రికాలో ఆడినప్పుడు బాల్స్ ని గమనిస్తే ఒకపక్క షైనింగ్ ఉండేదని బాగా స్వింగ్ అయ్యేవని ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ లో బాల్స్ మారిపోతున్నట్లు ఉందని చెప్పారు.

Also read:

బాల్స్ విషయంలో ఇన్స్పెక్షన్ జరగాలని రజా అన్నారు కొత్త బాల్స్ గట్టిగా లేవని ఇండియన్ బౌలర్ల బాల్స్ మీద ఎక్స్ట్రా లేయర్ కోటింగ్ ఉంటోంది అని చెప్పారు ముఖ్యంగా షమీ సిరాజ్ విషయంలో అనుమానం ఉందని ఏదో తప్పు జరుగుతుందని చెప్పారు. ఇండియాకి ఫేవర్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ఆరోపణ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది.

You may also like

Leave a Comment