Telugu News » Nampally Fire Accident : నాంపల్లి అగ్నిప్రమాదంపై కేసీఆర్ దిగ్ర్భాంతి.. స్పాట్ కు మంత్రులు

Nampally Fire Accident : నాంపల్లి అగ్నిప్రమాదంపై కేసీఆర్ దిగ్ర్భాంతి.. స్పాట్ కు మంత్రులు

ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. వీరిలో కొందరు ఊపిరాడక చనిపోగా, మరికొందరు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

by admin
massive-fire-accident-at-nampally

నాంపల్లి (Nampally) లోని బజార్‌ ఘాట్ లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భవన యజమాని చేసిన తప్పుకు అందులో అద్దెకు ఉంటున్న వారు బలయ్యారు. ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై (Tamilisai) విచారం వ్యక్తం చేశారు. అలాగే, సీఎం కేసీఆర్‌ (CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు దగ్గరుండి సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

massive-fire-accident-at-nampally

గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. సహాయ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలిచ్చారు. సోమవారం ఉదయం ఓ అపార్ట్‌ మెంట్‌ లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో మంటలు చెలరేగి ఐదు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. వీరిలో కొందరు ఊపిరాడక చనిపోగా, మరికొందరు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అపార్ట్‌ మెంట్‌ లో ఉన్న 15 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్ ముందు పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా దగ్ధమయ్యాయి.

ఈ ఘటనపై మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితిని పరిశీలించారు. బిల్డింగ్ ఓనర్ రమేష్ జైష్వాల్ గా గుర్తించారు అధికారులు. 5 అంతస్తుల భవనంలో భారీగా కెమికల్ డబ్బాలు నిల్వచేశారు. రమేష్ కు ప్లాస్టిక్ తయారు చేసే ఇండస్ట్రీ ఉన్నట్లుగా గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 150 పైగా కెమికల్ డబ్బాలను నిల్వచేసినట్లు అధికారులు తెలిపారు. వాటి వల్లే అగ్నిప్రమాదం జరిగింది. భవనంలో పెట్రోల్, డీజిల్ లేదని.. మంటలకు కెమికల్ డబ్బాలే కారణమని పోలీసులు కూడా తేల్చారు.

You may also like

Leave a Comment