Telugu News » MLC Kavitha : కవిత ఆసక్తికర ట్విట్.. వీడియో వైరల్..!!

MLC Kavitha : కవిత ఆసక్తికర ట్విట్.. వీడియో వైరల్..!!

అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో భాగంగా నిజామాబాద్ (Nizamabad) నుంచి జగిత్యాలకు వెళ్తున్న కవిత.. ఆర్మూర్‌లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు ఆరబెట్టిన వ‌రి ధాన్య‌పు రాశుల‌ను చూసి మురిసిపోయారు.

by Venu
mlc kavitha

రాజకీయ జీవితంతో తలమునకలవుతున్న నేతలు.. వారికి కాస్త విరామం దొరికిన టైమ్ లో లేదా ప్రచారంలో భాగంగా ప్రయాణం చేస్తున్నప్పుడు.. ఫోన్ కెమెరాకు పనిచెబుతారు.. మనసుకు నచ్చిన దృశ్యాలను చిత్రించి ట్విట్ట‌ర్‌లో షేర్ చేసి అభిమానులను ఆనందపరుస్తారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ( BRS) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత (MLC Kavitha) కూడా ఇలాగే ట్విట్ట‌ర్‌లో ఆసక్తిక‌ర పోస్టు చేశారు.

Mlc Kavitha: Another fight for the implementation of women's reservation: Mlc Kavithaఅసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో భాగంగా నిజామాబాద్ (Nizamabad) నుంచి జగిత్యాలకు వెళ్తున్న కవిత.. ఆర్మూర్‌లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు ఆరబెట్టిన వ‌రి ధాన్య‌పు రాశుల‌ను చూసి మురిసిపోయారు. వెంటనే ఆ దృశ్యాలను త‌న మొబైల్‌లో చిత్రీక‌రించి, ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణ అప్పుడు ఎట్లుంది.. ఇప్పుడు ఎట్లైందని ట్విట్ట‌ర్‌ కవిత పేర్కొన్నారు.

ప్రస్తుతం క‌విత‌ చేసిన ట్విట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మరోవైపు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఎన్నికలకు సమయం ఎక్కువగా లేకపోవడంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు కూడా బిజిబిజీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి..

You may also like

Leave a Comment