Telugu News » Palnadu: అత్తింటి వేధింపులు.. ముగ్గురిని నరికి చంపిన కోడలి బంధువులు..!

Palnadu: అత్తింటి వేధింపులు.. ముగ్గురిని నరికి చంపిన కోడలి బంధువులు..!

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో పాటు, అత్త, మామను కత్తులతో పొడిచి కడతేర్చారు.

by Mano
Mother's Dead Body: Sisters with mother's dead body for a year.. What happened..!

అత్తింటి వేధింపులతో సతమతమవుతున్న ఓ మహిళ తన గోడును బంధువులకు చెప్పుకుంది. దీంతో వారు కోపోద్రుక్తులై కూతురు జీవితం నాశనం అవుతుందని కూడా ఆలోచించలేదు. ఆమె భర్తతో పాటు, అత్త, మామను కత్తులతో పొడిచి కడతేర్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

palnadu

పిడుగురాళ్ల(Piduguralla) మండలం కోనంకి(Konanki) గ్రామానికి చెందిన మాధురి, నరేష్‌ల మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో మాధురికి అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె తరఫు బంధువులకు విషయాన్ని తెలిపింది. వారు కోనంకి వచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు.

అయితే, వారి మధ్య మాటామాట పెరిగి వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో మాధురి తరఫు బంధువులు విచక్షణ కోల్పోయారు. మాధురి భర్త నరేష్‌(30)తో పాటు అత్త ఆది లక్ష్మి(50), మామ సాంబయ్య(56)లను కత్తులతో అతిదారుణంగా పొడిచి హతమార్చారు.

ఈ హత్యకు సంబంధించి ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో మాధురితో పాటు ఆమె బంధువులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

You may also like

Leave a Comment