Telugu News » Road Accident: రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం..!

Road Accident: రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం..!

ఏపీ(AP)లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District) అమలాపురం రూరల్ మండలం(Amalapuram Rural Mandal) భట్నవిల్లీ(Bhatnavilli)లో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

by Mano

ఎనిమిది మంది యువకులు స్నేహితుడి బర్త్ డే(Friend Birthday) వేడుకలకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి మద్యం సేవించి బాగా ఎంజాయ్ చేశారు. అయితే తిరిగి వస్తుండగా మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి.

Road Accident: Four youths died in a road accident..!

ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ(AP)లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District) అమలాపురం రూరల్ మండలం(Amalapuram Rural Mandal) భట్నవిల్లీ(Bhatnavilli)లో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే.. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిది మంది యువకులు యానం వెళ్లారు.

ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.. అర్ధరాత్రి వరకు యానాంలో ఫుల్లుగా మద్యం సేవించారు. ఆ తర్వాత ఆటోలో సొంత ఊరికి బయల్దేరారు. అయితే, రాత్రి 12.30 గంటల సమయంలో అమలాపురం మండలం భట్నవిల్లిలో వీరు ప్రయాణిస్తున్న ఆటో లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో సాపే నవీన్ (22), కొల్లాబత్తుల జతిన్ (26), నల్లి నవీన్ కుమార్ (27), వల్లూరి అజయ్ (18) తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే  మృతిచెందారు.

మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని సమీపంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన నలుగురి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బాధిత కుటుంబాల రోధనలు మిన్నంటాయి.

You may also like

Leave a Comment