Telugu News » JP Nadda : బీఆర్ఎస్ పాలన అవినీతిమయం

JP Nadda : బీఆర్ఎస్ పాలన అవినీతిమయం

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదని మండిపడ్డారు నడ్డా. బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు అవినీతి పరులని అనేక స్కాములకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు.

by admin
jp-nadda-sensational-comments-on-congress-brs

తెలంగాణ (Telangana) బాగుపడాలంటే బీజేపీ (BJP) కే పట్టం కట్టాలన్నారు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda). జూబ్లీహిల్స్‌ లోని బాలానగర్ మండలం బూత్ నెంబర్ 264 కార్యకర్తలతో కలిసి ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం విన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పై విరుచుకుపడ్డారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ తోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన అవినీతి, అక్రమాలతో సాగిందన్నారు.

jp-nadda-sensational-comments-on-congress-brs

బీఆర్ఎస్ ను ఓడించి ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు నడ్డా. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టును ఏటీఎంలాగా మార్చుకున్నారని అన్నారు. రాష్ట్రంలో డబుల్​ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తానన్న ముఖ్యమంత్రి మాట తప్పారని విమర్శించారు. ఇదేకాదు చాలా హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని అన్నారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదని మండిపడ్డారు నడ్డా. బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు అవినీతి పరులని అనేక స్కాములకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్‌ గతంలో స్కాములకు పాల్పడిందని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటేనన్న ఆయన.. ఈ మూడు పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు.

కాంగ్రెస్ అవినీతికి అంతం లేదని… ఆ పార్టీ హయాంలో రాఫెల్, కామన్​ వెల్త్, 2జీ, 3జీ పేరుతో అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు నడ్డా. కానీ, మోడీ సర్కార్ దేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లు నిర్మించిందని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఉజ్వల యోజన పథకం కింద ప్రతి ఏడాది ఉచితంగా 4 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఎరువులు సబ్సిడీకి అందిస్తామన్నారు జేపీ నడ్డా.

You may also like

Leave a Comment