Telugu News » BJP MLA : బీఆర్ఎస్ లీడర్ బెదిరింపులకి భయపడే వాడిని కాదు..?

BJP MLA : బీఆర్ఎస్ లీడర్ బెదిరింపులకి భయపడే వాడిని కాదు..?

విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తులు తనను అక్రమ మైనింగ్, మాల్ అంశాల జోలికి పోవద్దని హెచ్చరిస్తున్నట్టు రాకేష్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో జరిగిన మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు..

by Venu

బీఆర్ఎస్ (BRS) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy).. తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు.. విదేశాల నుంచి తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. నీ అంతు చూస్తానని, చంపుతామని ఫోన్‌లో బెదిరిస్తున్నారని రాకేష్ రెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డి చేసిన చీకటి వ్యాపారాలను ప్రశ్నిస్తున్న తనపై, ఆయన కక్షకట్టినట్టు వెల్లడించారు..

ఒకవేళ తనను చంపాలని ప్రయత్నిస్తే.. వారికంటే ముందే తాను మగధీర సినిమాలో రామ్ చరణ్‌లా మారుతానని.. ఒక్కరిని కూడా మిగల్చకుండా అందరినీ చంపేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు రాకేష్ రెడ్డి (Rakesh Reddy)..ఇలాంటి బెదిరింపులకు బయపడే వాడిని కాదని తెలిపిన రాకేష్ రెడ్డి.. జీవన్ రెడ్డి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తానని హెచ్చరించారు.

విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తులు తనను అక్రమ మైనింగ్, మాల్ అంశాల జోలికి పోవద్దని హెచ్చరిస్తున్నట్టు రాకేష్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో జరిగిన మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.. ఈ విషయంలో సీబీఐ డైరెక్టర్‌ను కలిశానని తెలిపిన రాకేష్ రెడ్డి.. బెదిరింపు కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

త్వరలో ఈ విషయంపై హోం మంత్రి, సీఎంను కలుస్తానని కూడా చెప్పారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ (BJP) తరఫున పోటీ చేసిన రాకేష్ రెడ్డి మంచి మెజారిటీతో విజయం సాధించారు..

You may also like

Leave a Comment