Telugu News » Telangana BJP: స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం..!

Telangana BJP: స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం..!

తెలంగాణ స్పీకర్‌(Telangana Assembly Speaker) గడ్డం ప్రసాద్‌ కుమార్‌(Gaddam Prasad kumar) సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు 119మంది ఎమ్మెల్యేలకు 117మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.

by Mano
Telangana BJP: BJP MLAs taking oath in presence of Speaker..!

తెలంగాణ స్పీకర్‌(Telangana Assembly Speaker) గడ్డం ప్రసాద్‌ కుమార్‌(Gaddam Prasad kumar) సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 9న శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అదే రోజున వివిధ పార్టీలకు చెందిన 101 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

Telangana BJP: BJP MLAs taking oath in presence of Speaker..!

అయితే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లలేదు. ప్రొటెం స్పీకర్‌ ముందు తాము ప్రమాణం చేయబోమని స్పష్టం చేశారు. అయితే గురువారం ఉదయం స్పీకర్‌గా ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం సభలోకి అడుగుపెట్టిన బీజేపీ సభ్యులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త స్పీకర్‌ ఎదుట ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌, నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మహేశ్వర్‌ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

అదేవిధంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేశ్‌ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావ్‌ పవార్‌, నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, సిర్పూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పాల్వాయి హరీశ్‌ బాబు ప్రమాణ స్వీకారం చేశారు.

ఇప్పటి వరకు 119మంది ఎమ్మెల్యేలకు 117మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.

You may also like

Leave a Comment