Telugu News » Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. మహిళపై సామూహిక లైంగికదాడి ..!

Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. మహిళపై సామూహిక లైంగికదాడి ..!

హైదరాబాద్ (Hyderabad)లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఐదుగురు కామాంధులు ఓ మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నగరంలోని తార్నాక(Tarnaka) ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

by Mano
Hyderabad: Another atrocity in Hyderabad.. Mass assault on a woman..!

నగరంలో మహిళలు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ (Hyderabad)లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఐదుగురు కామాంధులు ఓ మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నగరంలోని తార్నాక(Tarnaka) ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

Hyderabad: Another atrocity in Hyderabad.. Mass assault on a woman..!

నగరంలోని ప్రశాంత్‌నగర్‌లో ఏసు అనే వ్యక్తి మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 7వ తేదీన అర్ధరాత్రి అతడు బైక్‌పై తార్నాక నుంచి ప్రశాంత్‌నగర్‌ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ కనిపించింది. దీంతో ఏసు తన బైక్‌ను ఆపి ఆ మహిళతో మాటలు కలిపాడు.

లాలాపేటలో దింపుతానని సదరు మహిళను నమ్మించి బైక్‌పై ఎక్కించుకున్నాడు. అనంతరం ప్రశాంత్‌నగర్‌ రైల్వే క్వార్టర్స్‌ వద్ద నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అతడి స్నేహితులు మధుయాదవ్, ప్రశాంత్, తరుణ్, రోహిత్‌లతో కలిసి సామూహిక లైంగికదాడి చేశారు.

అయితే.. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో లాలగూడా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ తరుణంలోనే మహిళపై లైంగికదాడి చేసిన ఏసు, ప్రశాంత్, మధుసూదన్, రోహిత్, తరుణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపారు.

You may also like

Leave a Comment