Telugu News » K.A Paul: కేఏ పాల్ సంచలన ప్రకటన.. మోడీని చిత్తుచిత్తుగా ఓడిస్తానంటూ సవాల్..!

K.A Paul: కేఏ పాల్ సంచలన ప్రకటన.. మోడీని చిత్తుచిత్తుగా ఓడిస్తానంటూ సవాల్..!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్(K.A Paul) సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)పై పోటీ చేస్తానని వెల్లడించారు.

by Mano
KA Paul: KA Paul's sensational announcement.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్(K.A Paul) సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)పై పోటీ చేస్తానని వెల్లడించారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తారని తెలిపారు.

KA Paul: KA Paul's sensational announcement.

తెలుగు సత్తా చూపించేందుకు మోడీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు పోటీ చేస్తానని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తనది గ్యారెంటీ అన్నారు. తనలాంటి వాడికి పార్లమెంటు వెళ్లే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

దేశంలో రాష్ట్రంలో అప్పులు తీరాలంటే జనవరి 30న గ్లోబల్ సమ్మిట్ జరగాలని ఆయన తెలిపారు. జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు రూ.1000కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా ప్రభుత్వంలోకి రావాలని మోడీ, అమిత్ షాలు తనను కోరారని, అయితే అందుకు తాను నిరాకరించానని కేఏ పాల్ అన్నారు.

అంతేకాదు.. తాను తప్ప ఎవరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చలేరని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు వడ్డీలు కూడా కట్టలేదు. ఇతర సాకులతో గడిపేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజాశాంతి పార్టీకి ఇక సింబల్ రానుందని కేఏ పాల్ వెల్లడించారు. టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలనుకునే వాళ్లను రూ.50కోట్లు అడుగుతున్నారంట.. అంటూ కేఏ పాల్ ఆరోపించారు.

You may also like

Leave a Comment