Telugu News » Emmanuel Macron : భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు..!!

Emmanuel Macron : భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు..!!

తన పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపిన మెక్రాన్.. ఫ్రెంచ్‌ మాట్లాడలేని విద్యార్థుల కోసం అంతర్జాతీయ తరగతులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నెట్ వర్క్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

by Venu

ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు (Indian students) ఫ్రాన్స్‌లో చదువుకునే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఎక్స్‌ (X) వేదికగా పోస్ట్ చేశారు.

ఈమేరకు దాదాపు 30 వేల మంది విద్యార్థులను 2030 నాటికి ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తద్వారా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలక భాగస్వామి అయిన భారత్‌తో ఫ్రాన్స్ సంబంధాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో, ఈ ప్రణాళిక భాగమని వెల్లడించారు.

ఈ క్రమంలో తన పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపిన మెక్రాన్.. ఫ్రెంచ్‌ మాట్లాడలేని విద్యార్థుల కోసం అంతర్జాతీయ తరగతులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నెట్ వర్క్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఫ్రాన్స్‌లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.

మరోవైపు భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం మెక్రాన్‌ ప్రత్యేక విమానంలో గురువారం జైపుర్‌ నగరానికి చేరుకున్నారు. అనంతరం జైపుర్‌ శివారులోని ఆమెర్‌ కోటను సందర్శించారు. ప్రధాని మోదీ ఆయనకు హస్తకళల దుకాణంలో అయోధ్య రామమందిర నమూనాను కొనుగోలు చేసి బహూకరించారు. తర్వాత ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment